INDvsSA 2nd ODI: భారత్ – దక్షిణాఫ్రికా మధ్య గబెరా వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా యువ బ్యాటర్లు తడబడ్డారు. ఓపెనర్ సాయి సుదర్శన్ (83 బంతుల్లో 62, 7 ఫోర్లు, 1 సిక్సర్), కెప్టెన్ కెఎల్ రాహుల్ (64 బంతుల్లో 56, 7 ఫోర్లు) మినహా మిగిలినవారంతా పెవిలియన్కు క్యూ కట్టడంలో పోటీ పడ్డారు. ఫలితంగా భారత్.. 46.2 ఓవర్లలో 211 పరుగులకు ఆలౌట్ అయింది. సఫారీ పేసర్లలో నండ్రె బర్గర్ మూడు వికెట్లు (3/30) రాణించాడు.
గబెరాలోని సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా భారత్కు వరుసగా షాకులిచ్చింది. తొలి బంతికే బౌండరీ బాదిన రుతురాజ్ గైక్వాడ్.. రెండో బంతికి వికెట్ల ముందు దొరికిపోయాడు. వన్ డౌన్లో వచ్చిన తిలక్ వర్మ (10) కూడా విఫలమయ్యాడు. ఈ రెండు వికెట్లూ బర్గర్కే దక్కాయి.
46పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన భారత్ను సాయి, రాహుల్లు ఆదుకున్నారు. నెమ్మదిగా బ్యాటింగ్ చేసినా స్కోరుబోర్డును ముందుకు నడిపించారు. ఈ జోడీ మూడో వికెట్కు 68 పరుగులు జోడించారు. అరంగేట్రం చేసిన తొలి వన్డేలోనే అర్థ సెంచరీ చేసిన సాయి.. ఈ మ్యాచ్లో కూడా మరో ఫిఫ్టీ పూర్తిచేసుకున్న తర్వాత లిజాడ్ విలియమ్స్ వేసిన 27వ ఓవర్లో వికెట్ కీపర్ క్లాసెన్కు క్యాచ్ ఇచ్చాడు. రాకరాక వచ్చిన అవకాశాన్ని సంజూ శాంసన్ (12) వినియోగించుకోలేదు. తొలి వన్డే ఆడుతున్న రింకూ సింగ్ (17) కూడా కట్టుకోలేదు. అక్షర్ పటేల్ (7), కుల్దీప్ యాదవ్ (1) అలా వచ్చి ఇలా వెళ్లారు. ఆఖర్లో అర్ష్దీప్ సింగ్ (17 బంతుల్లో 18, 1 ఫోర్, 1 సిక్స్) భారత స్కోరును రెండు వందల మార్కును దాటించాడు.
🏏 🔟 Overs Remaining
More disciplined death bowling with be required in the remaining overs. Only 3 wickets left in the India innings
🇮🇳 India are 177/7 after 40 overs #WozaNawe #BePartOfIt #SAvIND pic.twitter.com/8I02kcqiKu
— Proteas Men (@ProteasMenCSA) December 19, 2023