Cricketers- Holi : ఐపీఎల్ 17వ సీజన్లో అదరగొడుతున్న భారత క్రికెటర్లు హోలీ(Holi) సందర్భంగా రంగుల్లో మునిగి తేలారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ సందడి చేశారు. తమ ఫ్రాంచైజీ ఆటగాళ్లతోనే హోలీని సెలబ్రేట్ చేసుకున్నారు. ముంబై ఇండియన్స్ మాజీ సారథి రోహిత్ శర్మ(Rohit Sharma) సహచరులపై రంగులు చల్లాడు.
అంతేకాదు రోహిత్ నీళ్ల పైపుతో అందర్నీ తడిపేసి హోలీ సంబురాలు చేసుకున్నాడు. ముంబై ఫ్రాంచైజీ ఆ వీడియోను ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. కోల్కతా నైట్ రైడర్స్ జట్టు సభ్యులు సైతం హోలీని సంబురంగా చేసుకున్నారు. ఈడెన్ గార్డెన్స్ హీరో హర్షిత్ రానాతో పాటు పలువురు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer)ను రంగుల్లో ముంచెత్తారు.
Happy Holi, everyone! 😍🎨
Brb, admin needs to get the phone repaired 🥲#MumbaiMeriJaan #MumbaiIndians | @ImRo45 pic.twitter.com/4I0aIqnvru
— Mumbai Indians (@mipaltan) March 25, 2024
అనంతరం అయ్యర్.. మెంటార్ గౌతం గంభీర్(Gautam Gabhir)ముఖానికి రంగులు పులిమాడు. అంతేనా రంగు ముఖాలతో ఫొటోలు దిగారు. కోల్కతా ఫ్రాంచైజీ ఎక్స్ ఖాతాలో పెట్టిన ఆ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. తమ ఆటగాళ్లు హోలీని సంబురంగా చేసుకోవాడనికి కోల్కతా అన్ని ఏర్పాట్లు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్, డేవిడ్ వార్నర్లు సైతం ఉత్సాహంగా హోలీ ఆడారు. పంత్ అయితే.. సహచరులపై రంగులు, నీళ్లు చల్లుతూ మస్త్ ఎంజాయ్ చేశాడు.
Bura na maano, Holi hai! 😂💜 pic.twitter.com/B02FGO6hsE
— KolkataKnightRiders (@KKRiders) March 25, 2024
𝘽𝙪𝙧𝙖 𝙣𝙖 𝙢𝙖𝙣𝙤𝙤𝙤𝙤𝙤𝙤_____? 😍🎨#YehHaiNayiDilli #IPL2024 #Holi pic.twitter.com/RyHcTrLglj
— Delhi Capitals (@DelhiCapitals) March 25, 2024
ఐపీఎల్ 17వ సీజన్లో ముంబై ఎప్పటిలానే తొలి మ్యాచ్లో ఓడిపోయింది. ఆదివారం జరిగిన మ్యాచ్లో రోహిత్ శర్మ(43), బ్రెవిస్(45)లు పోరాడినా గుజరాత్ టైటాన్స్ ఆరు పరుగుల తేడాతో గెలిచింది. ఇక సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన తొలి పోరులో కోల్కతా ఉత్కంఠ విజయం సాధించింది.