న్యూఢిల్లీ: భారత యువ టెన్నిస్ స్టార్ సుమిత్ నాగ్ మియామి ఓపెన్లో శుభారంభం చేశాడు. టోర్నీలో తొలిసారి బరిలోకి దిగిన నాగల్ మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వాలిపయర్ తొలి రౌండ్లో నాగల్ 7-6(3), 6-2తో గాబ్రియెల్(కెనడా)పై అద్భుత విజయం సాధించాడు.
హోరాహోరీగా సాగిన తొలి సెట్ను టైబ్రేక్లో గెలిచిన నాగల్..రెండో సెట్లో తనదైన దూకుడు కనబరిచాడు. దీంతో నాగల్ ఏటీపీ ర్యాంకింగ్స్లో 92వ ర్యాంక్కు చేరుకున్నాడు.