న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్ పోరాటం ముగిసింది. డిఫెండింగ్ చాంపియన్ లక్ష్యసేన్, స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ప్రిక్వార్టర్స్లోనే ఇంటి బాటపట్టగా.. సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జంట గాయం కారణంగా ప్రత్యర్థికి వాకోవర్ ఇచ్చింది. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-750 పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో గురువారం లక్ష్యసేన్ 21-16, 15-21, 18-21తో గెమ్కే (డెన్మార్క్) చేతిలో ఓడాడు. తొలి గేమ్ నెగ్గిన లక్ష్య.. ఆ తర్వాత వరుసగా రెండు గేమ్లు కోల్పోయి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. మహిళల విభాగంలో సైనా 9-21, 12-21తో మూడో సీడ్ చెన్ యూఫీ (చైనా) చేతిలో ఓడింది. కృష్ణ ప్రసాద్-విష్ణువర్ధన్, గాయత్రీ గోపీచంద్-త్రిసా జాలీ జోడీలు కూడా నిష్క్రమించాయి.