యెచియోన్(దక్షిణకొరియా): ప్రతిష్ఠాత్మక ఆర్చరీ వరల్డ్కప్ టోర్నీలో భారత స్టార్ ఆర్చర్ వెన్నెం జ్యోతి సురేఖ రెండు పతకాలతో అదరగొట్టింది. శనివారం జరిగిన మహిళల కాంపౌండ్ టీమ్ ఈవెంట్ ఫైనల్లో జ్యోతిసురేఖ, పర్నీత్కౌర్, అదితి స్వామితో కూడిన భారత త్రయం 232-226తో హజల్ బురున్, బెరా సుజుర్, యువ బేగం(టర్కీ)పై అద్భుత విజయం సాధించింది.
వరుసగా మూడు ప్రపంచకప్ టోర్నీలో భారత ఆర్చర్లు పసిడి పతకాలు కొల్లగొట్టారు. అదే జోరు కనబరుస్తూ కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ ఫైనల్లో జ్యోతి సురేఖ, ప్రియాంశ్ ద్వయం 153-155తో ఒలివియా డీన్, స్వావెర్ సులివాన్(అమెరికా) జోడీ చేతిలో ఓడి రజత పతకంతో సరిపెట్టుకున్నారు. పురుషుల కాంపౌండ్ టీమ్ కాంస్య పోరులో ప్రియాంశ్, పార్థమేశ్, అభిషేక్ త్రయం ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైంది. మహిళల రికర్వ్ విభాగంలో దీపికా కుమారి సెమీస్లోకి దూసుకెళ్లింది. వ్యక్తిగత కాంపౌండ్ కాంస్య పోరులో పార్థమేశ్ ఓటమిపాలయ్యాడు.