కోబ్(జపాన్): ప్రతిష్ఠాత్మక పారా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో భారత పతక జోరు ఆఖరి వరకు దిగ్విజయంగా కొనసాగింది. పోటీలకు ఆఖరి రోజైన శనివారం సిమ్రాన్శర్మ స్వర్ణ పతకంతో మెరిసింది. మహిళల 200మీటర్ల టీ12 రేసును సిమ్రాన్ 24.95సెకన్లలో ముగించి పసిడి పతకాన్ని ముద్దాడింది. తన వ్యక్తిగత ప్రదర్శన(25.16సె)ను మరింత మెరుగుపర్చుకుంటూ అగ్రస్థానంలో నిలిచింది.
మరోవైపు మహిళల 100మీటర్ల టీ35 విభాగంలో ప్రీతిపాల్ కాంస్య పతకం దక్కించుకోగా, పురుషుల జావెలిన్త్రో ఎఫ్41 కేటగిరీలో నవదీప్సింగ్ కాం స్యం సొంతం చేసుకున్నాడు. పురుషుల జావెలిన్త్రో ఎఫ్46లో రింకూ హుడాకు రజతం, అజిత్కు కాంస్యం లభించాయి. మొత్తంగా భారత్ 17 పతకాలతో ఆరో స్థానంలో నిలిచింది.