Indian flag | ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy) నేటి నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ వెంట్ ప్రారంభానికి ముందుకు కరాచీ స్టేడియం (Karachi stadium)పై భారత జాతీయ జెండా (Indian flag ) రెపరెపలాడింది. చాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. ఐసీసీ నిబంధనల ప్రకారం ఏదైనా టోర్నీ జరుగుతున్న సమయంలో.. టోర్నీలో పాల్గొనే జట్లకు సంబంధించిన జెండాలను ఎగుర వేయాల్సి ఉంటుంది. అయితే, నిబంధనలకు విరుద్ధంగా గడాఫీ స్టేడియంలో భారత జెండాను పాకిస్థాన్ విస్మరించింది.
India’s flag raised at the National Stadium in Karachi. What a moment 🇵🇰🇮🇳♥️♥️
We have big hearts, we don’t do cheap acts. All 7 Indian journalists granted Pakistan visas too 🤗 #ChampionsTrophy2025 pic.twitter.com/zWfIMCaVex
— Farid Khan (@_FaridKhan) February 18, 2025
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. పీసీబీ (PCB) తీరుపై టీమ్ఇండియా అభిమానులు దుమ్మెత్తిపోశారు. దాయాది దేశం కావాలనే ఇలా చేసిందంటూ విమర్శలు చేశారు. మాజీ క్రికెటర్లు, పలువురు రాజకీయ నాయకులు సైతం పాక్ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. పాకిస్థాన్ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆరపించారు. ఈ విమర్శలతో దిగొచ్చిన పాక్.. ఎట్టకేలకు కరాచీ స్టేడియంపై భారత మువ్వన్నెల జెండాను ఏర్పాటు చేసి వివాదానికి ముగింపు పలికింది.
No Indian flag in Karachi: As only the Indian team faced security issues in Pakistan and refused to play Champions Trophy matches in Pakistan, the PCB removed the Indian flag from the Karachi stadium while keeping the flags of the other guest playing nations.
– Absolute Cinema,… pic.twitter.com/2zmcATn7iQ
— Nawaz 🇵🇰 (@Rnawaz31888) February 16, 2025
ఎనిమిదేండ్ల సుదీర్ఘ విరామం తర్వాత క్రికెట్ అభిమానుల నిరీక్షణకు బుధవారంతో తెరపడనుంది. ప్రతిష్టాత్మక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి బుధవారం నుంచి తెరలేవనుంది. 1996 తర్వాత పాకిస్థాన్ (Pakistan)లో జరుగుతున్న ఈ టోర్నీ నిర్వహణపై యావత్ దేశం భారీ అంచనాలే పెట్టుకుంది. 9వ ఎడిషన్గా జరుగబోయే ఈ టోర్నీని ఫిబ్రవరి 19 నుంచి మార్చి 09 దాకా పాకిస్థాన్, దుబాయ్లలో నిర్వహించనున్నారు. ఐసీసీ ఈవెంట్ హైబ్రిడ్ మోడల్లో జరుగుతున్న విషయం తెలిసిందే.
ఇందులో భాగంగా భారత్ జట్టు మ్యాచులన్నీ దుబాయిలో ఆడుంది. మిగతా జట్టు మ్యాచ్లు పాక్లోని కరాచీ, లాహోర్, రావల్పిండిలో జరుగనున్నాయి. బుధవారం ఆతిథ్య పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య కరాచీ వేదికగా తొలి మ్యాచ్ జరుగనుంది. టోర్నీకి ప్రత్యేక ఆకర్షణ అయిన భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ఈనెల 23న దుబాయ్లో జరుగుతుంది. మ్యాచ్లన్నీ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:30 గంటలకు మొదలవుతాయి.
2 గ్రూపులు.. 8 జట్లు.. 15 మ్యాచ్లు
వన్డేలలో ర్యాంకుల ఆధారంగా మొదటి 8 ర్యాంకులు కలిగిన దేశాలు ఆడనున్న ఈ టోర్నీలో జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-ఏలో పాకిస్థాన్, బంగ్లాదేశ్, భారత్, న్యూజిలాండ్ ఉండగా గ్రూప్-బీలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్, ఇంగ్లండ్ ఉన్నాయి. రౌండ్ రాబిన్ ఫార్మాట్లో జరుగబోయే ఈ టోర్నీలో భాగంగా గ్రూప్ దశ (మొత్తం 12 మ్యాచ్లు)లో ప్రతి జట్టు తమ గ్రూపులోని ఇతర జట్లతో ఒక మ్యాచ్ ఆడుతుంది. 19 నుంచి వచ్చే నెల 02 దాకా గ్రూప్ దశ మ్యాచ్లు జరుగనుండగా ఈ దశలో టాప్ -2లో నిలిచిన రెండు జట్లు సెమీస్కు అర్హత సాధిస్తాయి. దుబాయ్లో తొలి, లాహోర్లో రెండో సెమీస్ జరుగుతుంది. ఒకవేళ భారత్ ఫైనల్కు చేరితే టైటిల్ పోరు దుబాయ్లోనే జరుగుతుంది.
Also Read..
ICC Champions Trophy | నేటి నుంచి చాంపియన్స్ వార్.. మూడు దశాబ్దాల తర్వాత పాక్లో ఐసీసీ టోర్నీ
Champions Trophy: చాంపియన్స్ ట్రోఫీలో ఈ అయిదుగురు ఆటగాళ్లపై ఫోకస్ పెట్టాల్సిందే..
Champions Trophy | చాంపియన్స్ ట్రోఫీలో మరో వివాదం.. కరాచీలో కనిపించని భారత పతాకం