లండన్: భారత మహిళల జట్టు కీలక ప్లేయర్ జెమీమా రోడ్రిగ్స్.. హండ్రెడ్ టోర్నీలో నార్తెర్న్ సూపర్చార్జెస్కు ప్రాతినిధ్యం వహించనుంది. ఆస్ట్రేలియాకు చెందిన హీథర్ గ్రాహం స్థానంలో 22 ఏండ్ల జెమీమా బరిలోకి దిగనుంది. వచ్చే నెల ఒకటిన ప్రారంభం కానున్న ఈ టోర్నీ 27 వరకు సాగనుంది.
హండ్రెడ్ లీగ్లో భారత్ నుంచి కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (ట్రెంట్ రాకెట్స్), వైస్ కెప్టెన్ స్మృతి మందన (సౌతెర్న్ బ్రేవ్), వికెట్ కీపర్ రిచా ఘోష్ (లండన్ స్పిరిట్) కూడా పాల్గొంటున్నారు. ‘హండ్రెడ్ టోర్నీలో తిరిగి పాల్గొననుండటం చాలా ఆనందంగా ఉంది.’ అని జెమీమా పేర్కొంది.