బార్సిలోనా: భారత మహిళల హాకీ జట్టు జోరు కొనసాగుతున్నది. స్పెయిన్ హాకీ సమాఖ్య శత వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ టోర్నీలో భారత్ వరుసగా రెండో విజయం నమోదు చేసుకుంది. ఆదివారం భారత్ 3-0తో స్పెయిన్ను చిత్తుచేసింది.
భారత్ తరఫున వందన కటారియా (22వ నిమిషంలో), మోనిక (48వ ని.లో), ఉదిత (58వ ని.లో) తలా ఒక గోల్ చేశారు. మరోవైపు భారత పురుషుల జట్టు 2-1తో నెదర్లాండ్స్పై విజయం సాధించింది.