యాంక్టన్ (అమెరికా): ప్రపం చ ఆర్చరీ చాంపియన్షిప్లో భారత్ పతక వేట మొదలుపెట్టింది. బుధవారం జరిగిన మహిళల కాంపౌండ్ ఆర్చరీ టీమ్ ఈవెంటులో జ్యోతి సురేఖ, ప్రియా గుర్జార్, ముస్కాన్ కిరార్తో కూడిన భారత జట్టు పసిడి పతకంతో మెరిసింది. ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన ఫైనల్లో భారత్ 226-225 తేడాతో అమెరికా త్రయంపై అద్భుత విజయం సాధించింది. పురుషుల కాంపౌండ్ ఫైనల్లో అభిషేక్ వర్మ, సంగమ్ బిస్లా, రోషబ్ యాదవ్తో కూడిన భారత త్రయం 235-238 తేడాతో ఆస్ట్రియా చేతిలో ఓడి రజత పతకంతో సంతృప్తి పడింది.