న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక సుదిర్మన్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీని భారత జట్టు ఓటమితో ప్రారంభించింది. ఆదివారం జరిగిన తొలి పోరులో భారత్ 1-4తో చైనీస్ తైపీ చేతిలో పరాజయం పాలైంది. మహిళల డబుల్స్లో గాయత్రి గోపీచంద్-త్రిసా జాలి జోడీ విజయం సాధించగా..
మిగిలిన నాలుగు మ్యాచ్ల్లోనూ మన షట్లర్లు ఓటమి పాలయ్యారు. మహిళల సింగిల్స్లో పీవీ సింధు, పురుషుల సింగిల్స్లో ప్రణయ్ ప్రభావం చూపలేకపోయారు. డబుల్స్లో సాయి ప్రతీక్-క్రాస్టో, సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడీలు ఓటమి పాలయ్యాయి.