భువనేశ్వర్ : ఇంటర్ కాంటినెంటల్ కప్ ఫుట్బాల్ టోర్నీలో భారత జట్టు ఫైనల్స్ బెర్త్ను ఖాయం చేసుకుంది. సోమవారం జరిగిన చివరి గ్రూప్ మ్యాచ్లో భారత జట్టు 1-0తో వనౌటును ఓడించింది. స్థానిక కళింగ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో భారత కెప్టెన్ సునీల్ చెత్రి 80వ నిమిషంలో గోల్ సాధించి జట్టు విజయానికి దోహదం చేశాడు.
భారత జట్టు ఆడిన రెండు మ్యాచ్లలో గెలుపొందింది. ఇక గురువారం జరిగే చివరి గ్రూప్ మ్యాచ్లో భారత జట్టు లెబనాన్తో తలపడుతుంది. ఫైనల్స్ ఆదివారం జరుగుతుంది.