న్యూఢిల్లీ: వచ్చే నెలలో జరుగనున్న ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో.. భారత స్టార్ ఆటగాళ్లు కిడాంబి శ్రీకాంత్, లక్ష్యసేన్, హెచ్ఎస్ ప్రణయ్ ఒకే పార్శం నుంచి పోటీ పడనున్నారు. దీంతో ఈ ముగ్గురిలో ఒక్కరికి మాత్రమే క్వార్టర్ ఫైనల్కు చేరే అవకాశం ఉంది. జనవరి 17 నుంచి 22 వరకు జరుగనున్న ఈ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగుతున్న లక్ష్యసేన్.. తొలి రౌండ్లో భారత్కే చెందిన ప్రణయ్తో తలపడనున్నాడు.
ఇదే క్వార్టర్లో స్టార్ ఆటగాడు కెంటా మెమొటా కూడా ఉండటం గమనార్హం. ఇక శ్రీకాంత్ తొలి రౌండ్లో విక్టర్ అక్సెల్సన్తో అమీతుమీ తేల్చుకోనున్నాడు. గాయం కారణంగా చాన్నాళ్లుగా మైదానానికి దూరంగా ఉన్న స్టార్ షట్లర్ పీవీ సింధు.. ఐదో సీడ్గా బరిలోకి దిగనుంది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో జెప్పీ బే-లాస్సె మొల్హడె (డెన్మార్క్) జంటతో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి ద్వయం పోటీ పడనుంది.