లండన్: ప్రతిష్ఠాత్మక ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ కోసం భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ప్రాక్టీస్ ప్రారంభించాడు. ఐపీఎల్లో తన జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్స్ చేరకుండానే నిష్క్రమించడంతో ముందుగానే ఇంగ్లండ్ చేరుకున్న కోహ్లీ.. సోమవారం సహచరులతో కలిసి ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నారు.
వచ్చే నెల 7 నుంచి ఓవల్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ జరుగనున్న విషయం తెలిసిందే. దీని కోసం ఐపీఎల్ ప్లేఆఫ్స్లో ఆడని భారత ఆటగాళ్లు ఇప్పటికే ఇంగ్లండ్లో ప్రాక్టీస్ మొదలెట్టారు. కోహ్లీతో పాటు పేసర్లు మహమ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, జైదేవ్ ఉనాద్కట్, ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నారు.