మనీలా: ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత షట్లర్లు శుభారంభం చేశారు. మనీలా వేదికగా మంగళవారం ప్రారంభమైన టోర్నీలో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి, తానీషా క్రాస్టో- ఇషాన్ భట్నాగర్ జోడీలు రెండో రౌండ్లోకి ప్రవేశించాయి. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో మూడో సీడ్ సాత్విక్-చిరాగ్ జోడీ 21-13, 21-19తో గెటర్హంగ్- నచానన్ (థాయిలాండ్) జంటను చిత్తు చేసింది. రెండు గేమ్ల్లో ఆధిక్యం ప్రదర్శించిన భారత్ జోడీ 27 నిమిషాల్లోనే మ్యాచ్ను ముగించింది.
ప్రిక్వార్టర్స్లో అకిరొ కోగ-తైచీ సైటో (జపాన్) జంటతో ఈ జోడీ తలపడనుంది. మిక్స్డ్ డబుల్స్ తొలి పోరులో తనీషా-ఇషాన్ జోడీ 21-15, 21-17తో లాచిక్ హిమ్-యెంగ్గా టింగ్ (హాంకాంగ్) జంటను ఓడించి ప్రిక్వార్టర్స్లోకి అడుగుపెట్టింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లోనే కృష్ణ ప్రసాద్ గరగ-విష్ణువర్ధన్ గౌడ్ జోడీకి నిరాశ ఎదురైంది.