దుబాయ్ : బుధవారం ఇక్కడ ప్రారంభమైన ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత షట్లర్లు పివి సింధు, కిడాంబి శ్రీకాంత్ ప్రిక్వార్టర్ ఫైనల్కు చేరుకున్నారు. మహిళల డబుల్స్ జోడి గాయత్రి-త్రిసా జాలికూడా ముందంజ వేశారు. కాగా లక్ష్య సేన్ తొలి రౌండ్లోనే ఇంటిదారిపట్టాడు.
ఇటీవల స్పెయిన్ మాస్టర్స్లో రన్నరప్గా నిలిచిన సింధు 21-15, 22-20తో చి సుపై 46 నిమిషాలలో గెలిచింది. ప్రిక్వార్టర్స్లో సింధు చైనాకు చెందిన హాన్ యును ఢీకొంటుంది. శ్రీకాంత్ తన తొలి రౌండ్ మ్యాచ్లో21-13, 21-8తో 25 నిమిషాలలో అద్నాన్ ఇబ్రహీంపై గెలుపొందాడు. ప్రిక్వార్టర్స్లో ప్రపంచ ఐదో ర్యాంకర్ కొదాయ్ నరఓకాతో తలపడతాడు. మరో భారత షట్లర్ లక్ష్య సేన్ తొలి రౌండ్లోనే ఓటమి పాలయ్యాడు.