బ్యాంకాక్: సింగపూర్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత షట్లర్లు పీవీ సింధు, హెచ్ఎస్ ప్రణయ్ రెండో రౌండ్లోకి ప్రవేశించారు. బ్యాంకాక్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో బుధవారం మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సింధు 21-12, 22-20తో ప్రపంచ 21వ ర్యాంకర్ లినె హోజ్మర్క్ (డెన్మార్క్)ను ఓడించింది.
పురుషుల సింగిల్స్లో ప్రణయ్ 21-9, 18-21, 21-9 తో జులిన్ కరగ్గీ (బెల్జియం)పై పోరాడి గెలిచాడు. కానీ పురుషుల సింగిల్స్లో లక్ష్యసేన్ 13-21, 21-16, 13-21తో విక్టర్ అక్సెల్సెన్ చేతిలో ఖంగుతినగా, కిడాంబి శ్రీకాంత్ 14-21, 3-11తో కొడాయ్ నరకొర (జపాన్) చేతిలో చిత్తుగా ఓడి నిరాశపరిచాడు. మహిళల డబుల్స్లో గాయత్రి గోపీచంద్-త్రిసాజాలీ ద్వయం ముందంజ వేయగా, పొన్నప్ప-క్రాస్టో ఓటమి ఓటమి పాలయ్యింది. పురుషుల డబుల్స్లో కృష్ణప్రసాద్-ప్రతీక్కూ నిరాశే ఎదురైంది.