దుబాయ్: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో భారత క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా తమ స్థానాలను ‘పది’లం చేసుకున్నారు. ఆయా విభాగాల్లో టాప్-10లో వీరు కొనసాగుతున్నారు. బుధవారం ఐసీసీ విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్ ఆల్రౌండర్ల విభాగంలో జడేజా 385 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. తర్వాతి స్థానంలో అశ్విన్ (341) నిలిచాడు. బౌలింగ్లో అశ్విన్ (850), జస్ప్రీత్ బుమ్రా (830) వరుసగా రెండు, మూడు ర్యాంకుల్లో కొనసాగుతున్నారు. బ్యాటింగ్ విభాగంలో కెప్టెన్ రోహిత్ శర్మ (754), మాజీ కెప్టెన్ కోహ్లీ (742) 8, 10 స్థానాల్లో ఉన్నారు. బంగ్లాదేశ్కు చెందిన లిటన్ దాస్, శ్రీలంక సీనియర్ ఆటగాడు మ్యాథ్యూస్ తమ ర్యాంకులను మెరుగుపర్చుకున్నారు.