Jasprit Bumrah | దుబాయ్: ఇంగ్లండ్తో తొలి టెస్టులో నిబంధనలను అతిక్రమించినందుకు గానూ.. భారత ఏస్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను ఐసీసీ మందలించింది. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో భాగంగా ఓలీ పోప్ పరుగు తీస్తుండగా.. బుమ్రా ఉద్దేశపూర్వకంగా బ్యాటర్ను అడ్డుకున్నట్లు మ్యాచ్ రిఫరీ నిర్ధారించాడు.
దీంతో ఐసీసీ లెవల్-1 తప్పిదం.. కోడ్ ఆఫ్ కాండక్ట్ ఆర్టికల్ 2.12 ప్రకారం బుమ్రాను మందలించడంతో పాటు.. ఒక డీ మెరిట్ పాయింట్ కేటాయించాడు. గత 24 నెలల్లో బుమ్రా చేసిన తొలి తప్పిదం కావడంతో.. అతడికి స్వల్ప శిక్ష పడింది. మ్యాచ్ అనంతరం బుమ్రా తప్పు అంగీకరించడంతో.. తదుపరి విచారణ అవసరం లేదని ఐసీసీ ఒక ప్రకటనలో పేర్కొంది.