వెలెన్సియా: ఐదు దేశాల హాకీ టోర్నీలో భారత పురుషుల జట్టు పేలవ ప్రదర్శన కొనసాగుతున్నది. ఇప్పటికే స్పెయిన్, బెల్జియం చేతిలో పరాజయం పాలైన భారత్.. మంగళవారం జరిగిన పోరులో 2-3తో జర్మనీ చేతిలో ఓడింది. భారత్ తరఫున అభిషేక్ (9వ నిమిషంలో), శంషేర్ సింగ్ (14వ ని.లో) చెరో గోల్ చేయగా.. జర్మనీకి మాల్టె (28వ ని.లో), క్రిస్టోఫర్ (50వ ని.లో), గాంజలో పైలట్ (51వ ని.లో) గోల్స్ అందించారు.
తొలి క్వార్టర్లోనే రెండు గోల్స్ కొట్టి పూర్తి ఆధిపత్యం కనబర్చిన టీమ్ఇండియా చివరి వరకు అదే జోరు కొనసాగించలేకపోయింది. మరో పదినిమిషాల్లో ఆట ముగుస్తుందనగా వరుసగా రెండు గోల్స్ కొట్టిన జర్మనీ విజయం సొంతం చేసుకుంది. బుధవారం జరుగనున్న పోరులో ఫ్రాన్స్తో భారత్ తలపడనుంది.