విశాఖపట్నం: భారత క్రికెటర్లు ప్రాక్టీస్లో బిజీ అయ్యారు. ఇంగ్లండ్తో రెండో టెస్టు కోసం విశాఖపట్నంకు చేరుకున్న టీమ్ఇండియా క్రికెటర్లు బుధవారం స్టేడియంలో చెమటోడ్చారు. ఐదు మ్యాచ్ల సిరీస్లో తొలి మ్యాచ్ చేజార్చుకున్న రోహిత్సేన..వైజాగ్ టెస్టులో పుంజుకోవాలని చూస్తున్నది. ఉదయం జరిగిన ప్రాక్టీస్ సెషన్లో భారత బ్యాటర్లు స్వీప్, రివర్స్ స్వీప్పైనా ప్రధానంగా దృష్టి సారిస్తూ ప్రాక్టీస్ కొనసాగించారు.