Pooja Vastrakar | ముంబై: భారత మహిళా క్రికెట్ జట్టు ఆల్రౌండర్ పూజా వస్త్రకార్ పొలిటికల్ పోస్టుతో వివాదంలో చిక్కుకుంది. దేశంలో సార్వత్రిక ఎన్నికల వేళ ఆమె.. కాంగ్రెస్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ ఫొటోను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పోస్ట్ చేయడం చర్చనీయాంశమైంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్ వంటి బీజేపీ ప్రముఖులు ఒక క్రికెట్ జట్టుగా ఉన్న మార్ఫ్డ్ ఫొటోతో ‘వసూలీ టైటాన్స్’ అని సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న పోస్ట్ను షేర్ చేసింది.
అంతేగాక ఈ పోస్టుకు ‘ఇంపాక్ట్ ప్లేయర్: ఈడీ’ అని జత చేసింది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పలువురు ప్రతిపక్ష నాయకులను ఈడీ అదుపులోకి తీసుకుంటున్న నేపథ్యంలో వస్త్రకార్ చేసిన ఈ పోస్ట్పై నెట్టింట భిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి. వస్త్రకార్ పోస్ట్ నెట్టింట వైరల్ అయిన కొద్దిసేపటికే ఆమె దీనిని తొలిగించింది. మరోవైపు ఇన్స్టాగ్రామ్లో తన ప్రమేయం లేకుండా వచ్చిన పోస్ట్పై పూజ..ప్రధాని మోదీకి క్షమాపణలు చెప్పింది.