దుబాయ్: పురుషుల అండర్-19 ఆసియాకప్లో భారత క్రికెట్ జట్టు బోణీ కొట్టింది. టోర్నీ తొలి పోరులో శుక్రవారం యంగ్ఇండియా 7 వికెట్ల తేడాతో అఫ్గానిస్థాన్ను చిత్తుచేసింది. మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 173 పరుగులకు ఆలౌటైంది.
జంషెద్ జద్రాన్ (43) టాప్ స్కోరర్ కాగా.. మన బౌలర్లలో అర్షిన్ కుల్కర్ణి, రాజ్ లింబాని చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో భారత్ 37.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. ఓపెనర్ అర్షిన్ (70 నాటౌట్) అజేయ అర్ధశతకంతో ఆకట్టుకోగా.. ముషీర్ ఖాన్ (48 నాటౌట్) రాణించాడు. టోర్నీలో భాగంగా ఆదివారం దాయాది పాకిస్థాన్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది.