Paris Olympics 2024 : భారత స్టార్ బాక్సర్లు ప్యారిస్ ఒలింపిక్స్ బెర్తు(Paris Olympics 2024) లక్ష్యంగా మరో పోరుకు సిద్ధమవుతున్నారు. ఏడుగురు పురుషులు, ఇద్దరు మహిళలతో కూడిన భారత బాక్సర్ల బృందం వరల్డ్ క్వాలిఫికేషన్ (World Qualification)టోర్నమెంట్లో తాడోపేడో తేల్చుకోనుంది. మార్చి 3న ఇటలీలో మొదలయ్యే మొదటి క్వాలిఫికేషన్ టోర్నీలో స్టార్ బాక్సర్లు శివ థాపా(Shiva Thapa), దీపక్ భొర్లా, నిషాంత్ దేవ్లో తమ పంచ్ పవర్ చూపేందుకు తహతహలాడుతున్నారు.
ఒలింపిక్స్లో బాక్సింగ్ విభాగంలో 49 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. ఈ టోర్నీలో కనీసం సెమీఫైనల్ చేరినా విశ్వ క్రీడల బెర్తు దక్కడం ఖాయం. అయితే.. భారత బాక్సర్లకు క్వాలిఫికేషన్ రౌండ్లో గట్టి పోటీ ఎదురవ్వనుంది. ఎందుకంటే.. ఎబుర్జెన్ మార్టినెజ్(కొలంబియా), టొమొయ త్సూబొల్(జపాన్), మక్ముద్ సబిర్ఖాన్(కజకిస్థాన్), యోఎల్ ఫినోల్(వెనెజులా) వంటి హేమాహేమీలు ఈ టోర్నీలో బరిలోకి దిగుతున్నారు.
భారత స్క్వాడ్ మహిళలు : జైస్మినే లంబోరియా(60 కిలోలు), అంకుశిత బొరో(66 కిలోలు).
పురుషుల బృందం : దీపక్ భొరియా (51 కిలోలు), మొహమ్మద్ హుసాముద్దీన్(57 కిలోలు), శివ థాపా(63.5 కిలోలు), సంజీత్(92 కేజీ), నిశాంత్ దేవ్(71 కిలోలు), లక్ష్య చహర్(80 కేజీ), నరేందర్ బెర్వాల్(91 ప్లస్ కేజీ).