Lok Sabha Polls | దేశంలో సార్వత్రిక ఎన్నికలకు (Lok Sabha Polls) సమయం దగ్గరపడుతోంది. దీంతో అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికపై తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. ఇక కేంద్రంలో వరుసగా రెండు సార్లు అధికారంలో ఉన్న బీజేపీ.. ఇప్పుడు హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. ఈ మేరకు ఎన్నికలకు గెలుపు గుర్రాలను సిద్ధం చేస్తోంది.
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 400 సీట్లు సాధించాలనే సంకల్పంతో ప్రధాని నరేంద్రమోదీ సరికొత్త వ్యూహాలకు పదును పెడుతున్నారు. బీజేపీ (BJP) సొంతంగా 370 సీట్లు గెలుచుకునేందుకు వ్యూహరచన చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ప్రజలను ఆకట్టుకునేలా బలమైన అభ్యర్థుల కోసం వెతుకుతున్నారు. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక పూర్తైనట్లు కూడా తెలుస్తోంది. ఎన్నికల షెడ్యూల్కు ముందే తొలి జాబితాను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.
అయితే ఈ లిస్ట్లో కమలం పార్టీ కొత్త ముఖాలను పరిచయం చేయబోతోందని టాక్. ముఖ్యంగా కొందరు స్టార్స్ను లోక్సభ బరిలో దింపబోతోందని జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. బాలీవుడ్ ఫైర్బ్రాండ్గా పేరుతెచ్చుకున్న ప్రముఖ నటి కంగనా రనౌత్ (Kangana Ranaut), యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar) బీజేపీ తరఫున లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక బీజేపీ రిలీజ్ చేసే ఫస్ట్ లిస్ట్లో మోదీ, షా పేర్లతో పాటు వీరిద్దరి పేర్లు కూడా ప్రకటించే అవకాశం ఉందని జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి.
ఢిల్లీలోని చాందినీ చౌక్ (Chandni Chowk) నుంచి అక్షయ్ కుమార్, హిమాచల్ ప్రదేశ్లోని మండి (Mandi) స్థానం నుంచి కంగనాను బరిలో నిలబెట్టే అవకాశాలున్నట్లు సమాచారం. ఈ ఎన్నికల్లో పోటీ విషయంపై బీజేపీ పెద్దలు ఇప్పటికే వీరిద్దరితో చర్చించినట్లు తెలిసింది. కంగన, అక్షయ్ సైతం గత కొన్ని రోజులుగా బీజేపీతో సన్నిహితంగా ఉంటున్నారు. రాజకీయాల్లోకి వచ్చేందుకు ఇదే సరైన సమయం అంటూ కంగన కూడా ఇటీవలే తన మనసులో మాట బయటపెట్టారు. ఆమె వ్యాఖ్యలకు గానూ బీజేపీ పెద్దల నుంచి కూడా సానుకూల స్పందన వచ్చింది. కంగన బీజేపీలో చేరితే స్వాగతిస్తామని స్వయంగా ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా అప్పట్లోనే ప్రకటించారు. దీంతో ఈ ఇద్దరు నటీనటులు బీజేపీ తరఫున లోక్సభ బరిలో దిగే అవకాశాలు ఉన్నాయని తెలిసింది.
Also Read..
Azam Cheema | 26/11 ముంబై బాంబు పేలుళ్ల ప్రధాన సూత్రధారి మృతి
Bengaluru cafe blast | ఈ అంశంలో బీజేపీ రాజకీయాలు చేయడం తగదు.. పేలుడు ఘటనపై సీఎం సిద్ధరామయ్య
Delhi Police | బెంగళూరు కేఫ్లో బాంబ్ బ్లాస్ట్.. ఢిల్లీలో పోలీసులు హై అలర్ట్