బ్యాంకాక్: బాక్సింగ్ వరల్డ్ క్వాలిఫయర్స్లో భారత బాక్సర్లు జోరు కొనసాగిస్తున్నారు. బ్యాంకాక్ వేదికగా బుధవారం జరిగిన మహిళల 60 కిలోల ప్రిక్వార్టర్స్లో అంకుశిత బొరో 4-1తో కజకిస్థాన్ బాక్సర్ రిమ్మా వొలొస్సెంకొను చిత్తు చేసి క్వార్టర్స్కు దూసుకెళ్లింది.
పురుషుల 71 కిలోల విభాగంలో నిషాంత్ దేవ్ 5-0తో థాయ్లాండ్ ప్లేయర్ పీర్పట్ యీసుంగ్న్యూన్ను ఓడించి క్వార్టర్స్కు అర్హత సాధించాడు. అరుంధతి చౌదరి (66 కిలోలు) 5-0తో స్టెఫనీ పీనీరో (పోర్టో రికొ)ను ఓడించి ప్రిక్వార్టర్స్కు చేరింది. పురుషుల 92 కిలోల కేటగిరీలో నరేందర్ బెర్వాల్ను ఈక్వెడార్ బాక్సర్ గెర్లాన్ గిల్మర్ ఓడించాడు.