Indian Air Force | అహ్మదాబాద్ (Ahmedabad) వేదికగా భారత్ – ఆస్ట్రేలియా ( India Vs Australia) మధ్య ప్రపంచకప్ ఫైనల్ (ICC World Cup Final) మ్యాచ్ అభిమానులకు కొత్త అనుభూతిని అందించబోతున్న విషయం తెలిసిందే. ఈ నెల 19వ తేదీన అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న ప్రపంచకప్ ఫైనల్లో భారత ఎయిర్ఫోర్స్కు చెందిన సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీమ్ ప్రదర్శనలు ఇవ్వబోతోంది. ఈ సందర్భంగా మ్యాచ్కు రెండు రోజులే ఉంటడంతో ఏరోబాటిక్ టీమ్ తాజాగా రిహార్సల్స్ (Surya Kiran aerobatic Team Rehearsals)ను మొదలు పెట్టేసింది. స్టేడియంపై సూర్యకిరణ్ ఎయిర్క్రాఫ్ట్లు చక్కర్లు కొడుతున్నాయి. అబ్బుర పరిచే విన్యాసాలు చేస్తున్నాయి. ఈ రిహార్సల్స్ నగర వాసులను ఆకట్టుకుంటున్నాయి. వీటిని స్థానికులు తమ ఫోన్లలో బంధించి సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. అవికాస్తా వైరల్గా మారాయి.
Indian Air Force will perform an air show ahead of the World Cup final 2023. Preparations have started.#INDvsAUS #CWC23 #AirIndia
#AUSvsSA #NarendraModiStadium#RohitSharma𓃵 #ViratKohli𓃵pic.twitter.com/Nv1kv8W4TE— CrickSachin🛡 (@Sachin_Gandhi7) November 17, 2023
ప్రతిష్ఠాత్మక ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరగనున్న విషయం తెలిసిందే. ఫైనల్స్లో భారత్ – ఆస్ట్రేలియా అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. టీమ్ఇండియా ఇప్పటికే అహ్మదాబాద్ చేరుకుంది. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు రెండు జట్ల మధ్య వరల్డ్కప్ తుదిపోరు ప్రారంభకానుంది. ఇక ఫైనల్ పోరు మొదలయ్యే పది నిమిషాల ముందు మొతెరా స్టేడియంపై సూర్యకిరణ్ ఎయిర్క్రాఫ్ట్లు ఆకాశంలో అద్భుత విన్యాసాలతో అలరించనున్నాయి. మొత్తం తొమ్మిది ఎయిర్క్రాఫ్ట్లు రకరకాల ఆకారాలతో అబ్బురపరుచనున్నాయి. ఈ నేపథ్యంలో నేడు, రేపు ఎయిర్షో రిహార్సల్స్ను నిర్వహిస్తోంది.
INDIAN AIR FORCE IS PREPARING 💪 💪 🫡🫡#INDvsAUS #INDvsAUS #WorldcupFinal #AUSvsIND #Ahmedabad #CWC2023 #INDvsAUSfinal#SAvsAUS #AUSvSA Dua Lipa #Shami #ShaheenShahAfridi #IndiaVsAustralia #MissUniverse2023 #QuintondeKock #WorldCupFinal #ViratKohli𓃵 pic.twitter.com/g19JVrP70D
— Simple man (@ArbazAh87590755) November 17, 2023
Also Read..
World Cup Final | వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్కు మోదీ, ధోనీ.. స్పెషల్ అట్రాక్షన్గా వాయుసేన విన్యాసాలు
Rajinikanth | వందశాతం పక్కా.. ఈ సారి ప్రపంచకప్ మనదే : రజినీకాంత్
Leopards | నాసిక్ వీధుల్లో పట్టపగలే చిరుతల సంచారం.. భయాందోళనలో ప్రజలు