సిడ్నీ: టీ20 వరల్డ్కప్లో ఇండియా రెండవ విజయాన్ని నమోదు చేసింది. ఇవాళ గ్రూప్ 2లో నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లో 56 రన్స్ తేడాతో భారత్ నెగ్గింది. 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 123 రన్స్ మాత్రమే చేసింది. భారత బౌలర్లలో భువనేశ్వర్, హర్షదీప్, అక్షర్ పటేల్, అశ్విన్లు ఒక్కొక్కరు రెండేసి వికెట్లు తీసుకున్నారు. ఈ విక్టరీతో గ్రూప్ 2లో ఇండియా నాలుగు పాయింట్లతో ప్రస్తుతం టాప్లో నిలిచింది. ఒక గ్రూపు నుంచి టాప్ రెండు జట్లు మాత్రమే సెమీస్కు వెళ్లనున్న విషయం తెలిసిందే.
A comprehensive win for India at the SCG against Netherlands 🙌🏻#NEDvIND | #T20WorldCup | 📝: https://t.co/9FPx3tOBBe pic.twitter.com/1a9Nz0sOiM
— ICC (@ICC) October 27, 2022
అంతకముందు ఇండియన్ టాపార్డర్ బ్యాటర్లు రాణించారు. నిర్ణీత ఓవర్లలో ఇండియా రెండు వికెట్ల నష్టానికి 179 రన్స్ చేసింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్లు హాఫ్ సెంచరీలతో హోరెత్తించారు. నిజానికి సిడ్నీ పిచ్ బ్యాటింగ్కు అనుకూలించలేదు. ఆరంభంలో బ్యాటర్లు కష్టపడ్డారు. ఓపెనర్ కేఎల్ రాహుల్ కేవలం 9 రన్స్కే వెనుదిరిగాడు. ఇక ఆ తర్వాత కోహ్లీ, రోహిత్(53)లు రెండు వికెట్కు భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మరోసారి కోహ్లీ తన క్లాసిక్ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. కోహ్లీ, రోహిత్లు రెండో వికెట్కు 73 రన్స్ జోడించారు.
.@akshar2026 put on an impressive show with the ball & was our top performer from the second innings of the #INDvNED #T20WorldCup match. 👌 👌 #TeamIndia
A summary of his performance 🔽 pic.twitter.com/VSKzpEByPc
— BCCI (@BCCI) October 27, 2022
ఇక మూడవ వికెట్కు కోహ్లీ, సూర్యకుమార్లు అజేయంగా 106 రన్స్ జోడించారు. విరాట్ కోహ్లీ వరుసగా రెండవ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. కోహ్లీ 44 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 62 రన్స్ చేసి నాటౌట్గా నిలిచాడు. ఇక సూర్యకుమార్ యాదవ్ కూడా భారీ షాట్లతో అలరించాడు. అతను వేగంగా స్కోర్ బోర్డును పరుగెత్తించాడు. సూర్యకుమార్ కేవలం 25 బంతుల్లో ఏడు ఫోర్లు, ఒక సిక్సర్తో 51 రన్స్ చేసి నాటౌట్గా నిలిచాడు. సూర్యకుమార్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.