Chess Olympiod : ఒలింపిక్స్ తరహాలో జరిగే ఫిడె చెస్ ఒలింపియాడ్లో భారత్ డబుల్ ధమాకా మోగించింది. 45వ చెస్ ఒలింపియాడ్లో అబ్బాయిలు స్వర్ణంతో చరిత్ర సృష్టించిన కాసేపటికే అమ్మాయిల బృందం కూడా పసిడితో రికార్డు నెలకొల్పింది. ఫైనల్ రౌండ్లో అజెర్బైజాన్ టీమ్పై గెలుపొంది.. ఈ టోర్నీ చరిత్రలో దేశానికి తొలిసారి స్వర్ణం అందించింది.
ద్రోణవల్లి హారిక, ఆర్. వైశాలి. దివ్యా దేశ్ముఖ్, వంతికా అగర్వాల్, తానియా సచ్దేవ్ బృందం చెస్ ఒలింపియాడ్లో పసిడితో నవశకానికి నాంది పలికింది. 44వ ఒలింపియాడ్లో కాంస్యానికే పరిమితమైన అమ్మాయిలు ఈసారి సంచలన ఆటతో పసిడి వెలుగులు విరజిమ్మారు.
బుడాపెస్ట్లో జరిగిన 45వ చెస్ ఒలింపియాడ్ ఓపెన్ విభాగంలో భారత పురుషుల బృందం చరిత్ర సృష్టించింది. ఆదివారం నల్ల పావులతో ఆడిన గ్రాండ్మాస్టర్ డి. గుకేశ్(D.Gukesh) రష్యా ఆటగాడు వ్లాదిమిర్ ఫెడోసీవ్పై అద్భుత విజయంతో దేశానికి బంగారు పతకం సాధించి పెట్టాడు. టోర్నీ ఆసాంతం గుకేశ్తో పాటు అర్జున్ ఎరిగేసి, ఆర్ ప్రజ్ఞానంద, విదిత్ గుజరాతీ, పీ హరికృష్ణ, శ్రీనాథ్ నారాయణన్(కెప్టెన్)లతో కూడిన బృందం అద్భుతంగా రాణించింది. రెండేండ్లకు ఓ సారి జరిగే ఈ టోర్నీలో 2022 లోకాంస్యంతో సరిపెట్టుకున్న భారత్కు ఈసారి స్వర్ణం దక్కడం గమనార్హం. 2014లోనూ ఇండియా కంచు మోత మోగించింది.