Ind Vs Aus T20 | ముంబై: ఆస్ట్రేలియాపై తొలి టీ20 సిరీస్ గెలించేందుకు భారత మహిళల జట్టు సిద్ధమైంది. మూడు మ్యాచ్ల సిరీస్లో ఇరు జట్లు చెరో విజయం సాధించగా.. మంగళవారం నిర్ణయాత్మక ఫైనల్ జరగనుంది. తొలి మ్యాచ్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టి కంగారూలను చిత్తుచేసిన హర్మన్ప్రీత్ బృందం.. రెండో మ్యాచ్లో అదే జోరు కొనసాగించలేకపోయింది. తాజా సీజన్లో టెస్టు విజయాలు సాధించడంతో పాటు.. వన్డేల్లో కాస్త పోరాడిన టీమ్ఇండియా.. ఆసీస్పై టీ20 సిరీస్ చేజక్కించుకోవాలని పట్టుదలతో ఉంది.
గతంతో పోల్చుకుంటే.. ఫీల్డింగ్, బౌలింగ్లో మన అమ్మాయిలు మెరుగ్గా కనిపిస్తున్నా.. ఆరుసార్లు ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాను నిలువరించాలంటే అన్ని రంగాల్లో రాణించాల్సి ఉంటుంది. ముఖ్యంగా కెప్టెన్ హర్మన్ప్రీత్పై ఒత్తిడి అధికంగా ఉంది. గత కొన్ని మ్యాచ్లుగా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్న హర్మన్ ఈ మ్యాచ్లోనైనా విజృంభిస్తుందా చూడాలి.