బర్మింగ్హోమ్ : ఇంగ్లండ్లోని బర్మింగ్ హోమ్ వేదికగా జరుగుతన్న కామన్వెల్త్ క్రీడల్లో భారత్ మరో స్వర్ణాన్ని సాధించింది. లాన్ బౌల్స్ మహిళల విభాగంలో భారత్ బంగారు పతకం సాధించి, కొత్త చరిత్ర సృష్టించింది. దక్షిణాఫ్రికాపై 17-10 తేడాతో భారత జట్టు గెలుపొందింది. లాన్ బౌల్స్ మహిళల విభాగంలో భారత్కు బంగారు పతకం రావడం ఇదే మొదటిసారి. ఇక ఫైనల్లో సౌతాఫ్రికా జట్టును ఓడించేందుకు భారత జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. మొత్తంగా కామన్వెల్త్ క్రీడల్లో భారత్కు ఇప్పటి వరకు నాలుగు స్వర్ణాలు వచ్చాయి. ఇందులో మూడు వెయిట్ లిఫ్టింగ్లో రాగా, మరో పతకం లాన్ బౌన్స్ మహిళల విభాగంలో వచ్చింది.