లండన్, జూలై 22 : భారత్లో తయారైన సామ్సంగ్ జెడ్8 ఫోల్డబుల్ సిరీస్ స్మార్ట్ఫోన్లు వచ్చే నెలలో దేశీయ మార్కెట్లో అందుబాటులోకి రానున్నాయి. ఈ ప్రీమియం ఫోన్లను ఆగస్టు 7 నుంచి స్టోర్లలో అమ్మకానికి పెట్టనున్నారు. స్టోరేజీ సామర్థ్యాన్నిబట్టి ధరల శ్రేణి రూ.1.25 లక్షల నుంచి 2.60 లక్షల మధ్య ఉంటుందని తెలిపింది.
కాగా, లండన్లో ఈ గెలాక్సీ జెడ్8 సిరీస్ ఫోన్లను సామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ బుధవారం ఆవిష్కరించింది. గెలాక్సీ జెడ్ ఫోల్డ్8 అల్ట్రా, జెడ్ ఫోల్డ్8, జెడ్ ఫ్లిప్8 మాడళ్లలో వీటిని తీసుకొచ్చారు. భారత్లోనూ ఇక ముందస్తు బుకింగ్లు చేసుకోవచ్చని కంపెనీ నైరుతి ఆసియా అధ్యక్షుడు జేబీ పార్క్ ప్రకటించారు.