కొలంబో: వన్డే సిరీస్ కైవసం చేసుకోవడంతో పాటు.. పొట్టి ఫార్మాట్లోనూ తొలి విజయంతో మంచి జోరుమీదున్న టీమ్ఇండియా మరో మ్యాచ్ మిగిలుండగానే టీ20 సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తున్నది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా మంగళవారం భారత్, శ్రీలంక మధ్య రెండో టీ20 జరుగనుంది. తొలి పోరులో సూర్యకుమార్ యాదవ్, శిఖర్ ధావన్, భువనేశ్వర్ కుమార్ ఆకట్టుకోగా.. లంకేయులు అన్ని విభాగాల్లోనూ విఫలమయ్యారు. ఈ ఏడాది చివర్లో టీ20 ప్రపంచకప్ జరుగనున్న నేపథ్యంలో.. జట్టులో చోటు దక్కించుకునేందుకు యువ ఆటగాళ్లు తహతహలాడుతున్నారు.