మహిళల వన్డే ప్రపంచకప్
ఉ. 6.30 నుంచి
మౌంట్మాంగనీ: మహిళల వన్డే ప్రపంచ కప్లో నాకౌట్ బెర్త్ దక్కించుకోవడమే లక్ష్యంగా దూసుకెళ్తున్న భారత జట్టు.. మరో కీలక పోరుకు సిద్ధమైంది. లీగ్ దశలో భాగంగా బుధవారం డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్తో మిథాలీ బృందం తలపడనుంది. గత మ్యాచ్లో వెస్టిండీస్పై భారీ విజయంతో భారత జట్టు ఫుల్ జోష్లో ఉండగా.. మరోవైపు ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ పరాజయాలు ఎదుర్కొన్న ఇంగ్లండ్ తిరిగి పుంజుకోవాలని చూస్తున్నది. తొలి మ్యాచ్లో పాకిస్థాన్ను చిత్తు చేసిన మిథాలీ బృందం.. మలి మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో పరాజయం పాలైంది. ఆ తర్వాత విండీస్తో పోరులో స్మృతి మందన, హర్మన్ప్రీత్ కౌర్ సెంచరీలు బాదడంతో భారీ విజయం ఖాతాలో వేసుకుంది.