‘బోర్డర్-గవాస్కర్’ (Border Gavaskar Trophy) సిరీస్లో భాగంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా (India vs Australia) మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో చివరి రోజు ఆట మొదలైంది. ఓవర్నైట్ 3/0 స్కోరుతో ఆస్ట్రేలియా తన రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించింది. క్రీజ్లో ట్రావిస్ హెడ్ (13), లబుషేన్ (7) ఉన్నారు. అంతకుముందు రవిచంద్రన్ అశ్విన్.. కునెమన్ (6)ను పెవిలియన్కు పంపాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా స్కోర్ 480 & 26/1 (19)
మ్యాచ్ ‘డ్రా’గా ముగుస్తుందా..
బోర్డర్-గవాస్కర్ సిరీస్లో భాగంగా జరిగిన గత మూడు టెస్టులకు భిన్నంగా తాజా మ్యాచ్ సాగుతున్నది. చివరి మూడు టెస్టులు మూడురోజుల్లోనే ముగియగా.. అహ్మదాబాద్ మ్యాచ్లో మాత్రం నాలుగోరోజు ఆట పూర్తైనా ఫలితం ఎటు మొగ్గుచూపుతుందో అర్థం కావడం లేదు. సోమవారం తొలి సెషన్లో భారత బౌలర్లను కంగారూలు ఎలా ఎదుర్కుంటారనేది కీలకం. తొలి ఇన్నింగ్స్లో భారీ సెంచరీ బాదిన ఉస్మాన్ ఖవాజా రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు రాలేదు. స్మిత్, లబుషేన్, హేడ్, గ్రీన్ను త్వరగా పెవిలియన్ చేర్చగలిగితే.. టీమ్ఇండియాకు తిరుగులేనట్లే. ఇప్పటికే 88 పరుగుల లోటులో ఉన్న కంగారూలు రెండొందల పరుగులు చేసినా.. రోహిత్ సేన టార్గెట్ ఛేదించి విజయం సాధించే అవకాశం ఉంటుంది. లేక నిర్జీవమైన పిచ్పై కంగారూలు చివరి రోజు కుదురుకొని బ్యాటింగ్ చేస్తే మ్యాచ్ ‘డ్రా’గా ముగియడం ఖాయమే. ఇతర జట్ల జయాపజయాలతో సంబంధం లేకుండా టీమ్ఇండియా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్కు అర్హత సాధించాలంటే ఈ మ్యాచ్లో విజయం తప్పనిసరి.
LBW!
There’s the first wicket of the day for #TeamIndia 🇮🇳
Matthew Kuhnemann departs and @ashwinravi99 strikes 💪🏻
Follow the match ▶️ https://t.co/8DPghkx0DE@mastercardindia pic.twitter.com/t9BEgsqII6
— BCCI (@BCCI) March 13, 2023