World Cup 2023 | వన్డే ప్రపంచ కప్ షెడ్యూల్లో ఐసీసీ స్వల్ప మార్పులు చేసింది. 9 మ్యాచ్ల తేదీలు, ప్రారంభ సమయాలను తేదీలను మార్చింది. భారత్ – పాక్ మ్యాచ్ అక్టోబర్ 15 నుంచి 14వ తేదీకి మార్చింది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా జరగనుంది. హైదరాబాద్లో జరిగే పాక్ – శ్రీలంక మ్యాచ్ తేదీలోనూ మార్పు చోటు చేసుకుంది. ఈ మ్యాచ్ను అక్టోబర్ 12 నుంచి 10వ తేదీకి మార్చింది. ఆస్ట్రేలియా – సౌతాఫ్రికా జట్ల మధ్య జరిగే మ్యాచ్ను అక్టోబర్ 13వ తేదీకి బదులుగా, 12వ తేదీనే నిర్వహించనున్నారు. ఇంగ్లండ్ – ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ అక్టోబర్ 14కు బదులుగా 15వ తేదీన జరగనుంది. న్యూజిలాండ్ – బంగ్లాదేశ్ మ్యాచ్ అక్టోబర్ 14వ తేదీకి బదులుగా 13వ తేదీన డే నైట్ మ్యాచ్ నిర్వహించనున్నారు. ఇంగ్లండ్ – బంగ్లాదేశ్ మ్యాచ్ను డే నైట్కు బదులగా ఉదయం 10:30 గంటలకే నిర్వహించనున్నారు. ఈ నెల 25 నుంచి ఆన్లైన్లో వన్డే ప్రపంచ కప్ మ్యాచ్ల టికెట్లను విక్రయించనున్నారు.