భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా లెజెండరీ ప్లేయర్లతో క్రికెట్ మ్యాచ్ నిర్వహించేందుకు బీసీసీఐ అంగీకరించినట్లు సమాచారం. ఇలా భారత్ వర్సెస్ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ మ్యాచ్ ఒకటి నిర్వహించాలని బీసీసీఐని భారత ప్రభుత్వం కోరింది. ఈ నెల 22వ తేదీన మ్యాచ్ పెట్టాలని సూచించింది. అయితే అంతర్జాతీయ షెడ్యూల్, ఇంగ్లండ్లో జరుగుతున్న దేశవాళీ టోర్నీ, రాబోయే కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్)ను దృష్టిలో ఉంచుకున్న బీసీసీఐ.. వేరే ఆలోచన చేసింది.
ప్రస్తుత స్టార్ ఆటగాళ్లతో కాకుండా మాజీ దిగ్గజాలతో క్రికెట్ మ్యాచ్ నిర్వహించేందుకు ప్లాన్ చేసింది. సెప్టెంబరు 15న ఈడెన్ గార్డెన్స్ వేదికగా మ్యాచ్ నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్లో భారత జట్టుకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ నాయకత్వం వహిస్తుండగా.. రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ జట్టుకు ఇంగ్లండ్ మాజీ సారధి ఇయాన్ మోర్గాన్ సారధ్యం చేస్తున్నాడు. ఈ మ్యాచ్ ఆడే జట్లను కూడా బీసీసీఐ విడుదల చేసింది.
భారత జట్టు: సౌరవ్ గంగూలీ (కెప్టెన్), వీరేంద్ర సెహ్వాగ్, మహమ్మద్ కైఫ్, యూసుఫ్ పఠాన్, సుబ్రమణ్యం బద్రినాథ్, ఇర్ఫాన్ పఠాన్, పార్థివ్ పటేల్, స్టువర్ట్ బిన్నీ, ఎస్ శ్రీశాంత్, హర్భజన్ సింగ్, నమన్ ఓఝా, అశోక్ దిండా, ప్రజ్ఞాన్ ఓఝా, అజయ్ జడేజా, ఆర్పీ సింగ్, జోగీందర్ శర్మ, రీతిందర్ సింగ్ సోధి
రెస్ట్ ఆఫ్ ది వరల్డ్: ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), లెండి సిమన్స్, హార్షెల్లే గిబ్స్, జాక్వస్ కలిస్, సనత్ జయసూర్య, మాట్ ప్రయర్, నాథన్ మెకల్లమ్, జాంటీ రోడ్స్, ముత్తయ్య మురళీధరన్, డేల్ స్టెయిన్, హామిల్టన్ మసకజ, మష్రాఫే మొర్తాజా, ఆష్గర్ అఫ్ఘాన్, మిచెల్ జాన్సన్, బ్రెట్ లీ, కెవిన్ ఒబ్రెయిన్, దినేష్ రామ్దిన్
🇮🇳 Exhibition game
🎉 75th Independence day
⚔️ India vs Rest of the World
📅 September 15
🏟️ Eden Gardens, Kolkata#SouravGanguly #CricketTwitter pic.twitter.com/yWfzn9YKbl— CricXtasy (@CricXtasy) August 12, 2022