పల్లెకిలే: పాకిస్థాన్తో జరగనున్న ఆసియాకప్(Asia Cup 2023) వన్డేలో.. తొలుత ఇండియా బ్యాటింగ్ చేయనున్నది. టాస్ గెలిచిన కెప్టెన్ రోహిత్ శర్మ మొదటి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. వెదర్ సరిగా లేదని, కానీ దాని గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదని రోహిత్ పేర్కొన్నాడు. ఛాలెంజింగ్ వాతావరణాన్ని ఎదుర్కోవాలన్నాడు. శ్రీలంకలో పల్లెకిలే వేదికగా ఈ మ్యాచ్ జరగనున్నది. శ్రేయాస్ అయ్యర్, బుమ్రా జట్టులోకి వచ్చినట్లు తెలిపాడు. శార్దూల్, హార్ధిక్, కుల్దీప్, జడేజా కూడా ఉన్నారు.
🚨 Toss & Team Update 🚨
Captain @ImRo45 has won the toss & #TeamIndia have elected to bat against Pakistan. #INDvPAK
A look at our Playing XI 🔽
Follow the match ▶️ https://t.co/hPVV0wT83S#AsiaCup2023 pic.twitter.com/onUyEVBwvA
— BCCI (@BCCI) September 2, 2023
శ్రీలంకలోని పల్లెకిలే వేదికగా జరగనున్న ఈ మ్యాచ్కు వర్షం అడ్డంకిగా మారింది. ఉదయం నుంచి అక్కడ పలుమార్లు జల్లులు కురిశాయి. దీంతో గ్రౌండ్లను కవర్లతో మూసివేశారు. కాసేపటి క్రితమే ఆ కవర్లను తీసివేశారు. చివర వరకు మ్యాచ్ జరుగుతుందా లేదా అన్న అంశంపై సందేహం నెలకొన్నది. నేపాల్తో జరిగిన మ్యాచ్లో గెలిచిన జట్టుతోనే.. భారత్తో మ్యాచ్కు పాకిస్థాన్ రంగంలోకి దిగనున్నది.
🚨 T O S S A L E R T 🚨
India win the toss and elect to bat first 🏏#PAKvIND | #AsiaCup2023 pic.twitter.com/9BwJ5qcYGF
— Pakistan Cricket (@TheRealPCB) September 2, 2023