పోర్ట్ ఆఫ్ స్పెయిన్: వెస్టిండీస్తో జరిగిన మూడో వన్డేల సిరీస్ను భారత్ క్లీన్స్వీప్ చేసింది. పోర్ట్ ఆఫ్ స్పెయిన్లో జరిగిన మూడో వన్డేలో ధవన్ సేన విజయం సాధించింది. దీంతో సిరీస్ను 3-0తో సొంతం చేసుకున్నది. మొదట టాస్ గెలిచిన టీమ్ఇండియా బ్యాంటింగ్కు దిగింది. ఓపెనర్లు శిఖర్ ధావన్ (58), శుభ్మన్ గిల్ (98) జట్టుకు మరోసారి శుభారంభాన్ని ఇచ్చారు. అయితే వరణుడు ఆటకు అడ్డుపడటంతో మ్యాచ్ను 36 ఓవర్లకు కుదించారు. దీంతో డక్వర్త్ లూయిస్ పద్ధతిలో భారత్ నిర్దేశించిన 257 పరుగుల లక్ష్యాన్ని విడీస్ ముందుంచింది.
అయితే భారీ విజయ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విండీస్ 26 ఓవర్లలోనే 137 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్ 119 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. విడీస్ జట్టులో కెప్టెన్ నికోలస్ పూరన్ (32 బంతుల్లో 42 రన్స్), బ్రెండన్ కింగ్ (42) మాత్రమే రాణించారు. భారత బౌలర్లలో చాహల్ 4 వికెట్లు పడగొట్టగా శార్ధూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్ తలో 2 వికెట్లు దక్కించుకున్నారు. ప్లేయర్ ఆఫ్ సిరీస్, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులను శుభ్మన్ గిల్ సొంత చేసుకున్నాడు.
కాగా, ఈ విజయంతో వెస్టిండీస్ జట్టుపై భారత్ వరుసగా 12 ద్వైపాక్షిక సిరీస్లు గెలిచింది. దీంతో ఈ రికార్డు నెలకొల్పిన ఏకైక జట్టుగా చరిత్ర సృష్టించింది. అదేవిధంగా విండిస్ గడ్డపై 39 ఏండ్ల తర్వాత తొలిసారిగా వన్డే సిరీస్ను క్లీన్స్వీప్ చేసింది. చివరిసారిగా 1983లో అప్పటి భారత జట్టు సొంతగడ్డపై వెస్టిండీస్ను వైట్వాష్ చేసింది.