రూర్కెలా: హాకీ ప్రపంచ చాంపియన్ జర్మనీకి భారత్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్లో భారత్ 3-2 తేడాతో జర్మనీపై అద్భుత విజయం సాధించింది. ఆఖరి వరకు ఆసక్తికరంగా సాగిన మ్యాచ్లో టీమ్ఇండియా తరఫున సుఖ్జీత్సింగ్ (31ని, 42ని) డబుల్ గోల్స్తో విజృంభించగా, హర్మన్ప్రీత్సింగ్ (30ని) మరో గోల్ చేశాడు. కాఫ్మన్ ఫిలిప్ (44ని), మిచెల్ (57ని) జర్మనీకి గోల్స్ అందించారు. ప్రపంచకప్ టోర్నీ తర్వాత ఆడిన తొలి మ్యాచ్లోనే జర్మనీ ఓటమి చవిచూసింది. ఆదివారం భారత్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరుగనుంది.