అమృత్సర్: ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్నకు ఆతిత్యమిచ్చేందుకు భారత్ ఉత్సాహం చూపుతున్నది. 2029 జరిగే మెగాటోర్నీ కోసం భారత్ బిడ్ వేయాలని భావిస్తున్నది.
భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) మొదట 2027 ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ ఆథిథ్యానికి పోటీ పడాలని భావించినా.. ఆ తర్వాత దాన్ని 2029కి మార్చుకున్నట్లు ఏఎఫ్ఐ ఉపాధ్యక్షురాలు అంజూ బాబ్ జార్జ్ వెల్లడించింది. మరోవైపు 2036 ఓలింపిక్స్ నిర్వహణపై కూడా భారత్ దృష్టి పెట్టడంతో.. అథ్లెటిక్స్ చాంపియన్షిప్ ఆతిథ్యమివ్వడం దేశంలో క్రీడలకు మరింత ప్రధాన్యత తీసుకొస్తుందని ఆమె పేర్కొంది.