పార్ల్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండవ వన్డేలో ఇండియా మొదట బ్యాటింగ్ చేసి నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 287 రన్స్ చేసింది. ఇండియన్ ఇన్నింగ్స్లో కేఎల్ రాహుల్, రిషబ్ పంత్లు హాఫ్ సెంచరీలు చేశారు. పార్ల్ మైదానంలో జరుగుతున్న మ్యాచ్లో దక్షిణాఫ్రికా బౌలర్లు ఇండియన్ బ్యాటర్లను మరోసారి కట్టడి చేశారు. పంత్ 85, రాహుల్ 55 రన్స్ చేసి ఔటయ్యారు. అయితే ఈ ఇద్దరూ మూడో వికెట్కు అత్యధికంగా 179 రన్స్ జోడించారు. చివరిలో శార్దూల్ ఠాకూర్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. శార్దూల్, అశ్విన్లు ఏడో వికెట్కు అజేయంగా 48 రన్స్ జోడించారు. శార్దూల్ 40, అశ్విన్ 25 రన్స్తో నాటౌట్గా నిలిచారు. సౌతాఫ్రికా బౌలర్లలో షంషీ రెండు వికెట్లు తీసుకున్నాడు.