చటోగ్రామ్: బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి రోజు భోజన విరామ సమయానికి ఇండియా 26 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 85 రన్స్ చేసింది. బంగ్లా బౌలర్లలో తొలి సెషన్లో కీలకమైన మూడు వికెట్లను పడగొట్టారు. రిషబ్ పంత్ దూకుడుగా ఆడుతున్నాడు. లంచ్ సమయానికి పంత్ 29, పూజారా 12 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. పంత్ స్కోర్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి.
It's time for Lunch in Chattogram 🍽️#BANvIND | #WTC23 | 📝 https://t.co/9ddVDebhC8 pic.twitter.com/tKYa3uTz55
— ICC (@ICC) December 14, 2022
తొలుత టాస్ గెలిచిన ఇండియా బ్యాటింగ్ ఎంచుకున్నది. కేఎల్ రాహుల్, శుభమన్ గిల్లు ఓపెనింగ్ చేశారు. ఆ ఇద్దరూ తొలి వికెట్కు 41 రన్స్ జోడించారు. రాహుల్ 22, గిల్ 20 రన్స్ చేసి ఔటయ్యారు. విరాట్ కోహ్లీ పెద్దగా బౌలర్లను ఇబ్బందిపెట్టలేకపోయారు. కోహ్లీ కేవలం ఒకే ఒక్క రన్స్ చేశాడు. బంగ్లా బౌలర్ తైజుల్ ఇస్లామ్ తన ఖాతాలో తొలి సెషన్లో రెండు వికెట్లు వేసుకున్నాడు.