T20 World Cup | న్యూయార్క్: మరో మూడు రోజుల్లో వెస్టిండీస్/అమెరికా వేదికలుగా మొదలుకాబోయే టీ20 వరల్డ్కప్లో ‘హై ఓల్టేజ్ మ్యాచ్’గా భావిస్తున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్కు ఉగ్ర ముప్పు పొంచి ఉన్నట్టు తెలుస్తోంది. మూడువారాల క్రితమే ట్రినిడాడ్ అండ్ టొబాగో (వెస్టిండీస్లో ఓ దీవి) ప్రధాని సైతం ఈ విషయంలో ఆందోళన వ్యక్తం చేయగా తాజాగా ముష్కర ముఠాలు దాయాదుల పోరుకు ముప్పు తలపెట్టనున్నట్టు వార్తలు వస్తున్నాయి.
‘ఐసిస్’ అండతో రెచ్చిపోతున్న ఓ ఉగ్ర ముఠా ఆన్లైన్ వేదికగా ‘మీరు మ్యాచ్ల కోసం వేచి చూస్తున్నారు. మేము మీకోసమే ఎదురుచూస్తున్నాం’ అని ఓ వ్యక్తి ఆయుధాలు ధరించి ఉన్న ఫొటోను షేర్ చేసింది. అదే ఫొటోలో ‘నసావు స్టేడియం.. 09/06/2024’ అని కూడా ఉండటం ఆందోళనకు దారితీసింది. జూన్ 9న ఇదే స్టేడియంలో రోహిత్ సేన..పాక్తో తలపడనుంది.