ODI WC 2023 : సొంత గడ్డపై వన్డే వరల్డ్ కప్(ODI WC 2023) కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు గుడ్ న్యూస్. అక్టోబర్ 14న జరుగనున్న భారత్(India), పాకిస్థాన్(Pakistan) మ్యాచ్ టికెట్లు సెప్టెంబర్ 3 నుంచి అందుబాటులో ఉండనున్నాయి. ఈ విషయాన్ని ఐసీసీ తాజాగా వెల్లడించింది. టీమిండియా భారత జట్టు వామప్ మ్యాచ్(Warmup Matches) సహా ఇతరర మ్యాచ్ల టికెట్లు ఆగస్టు 30 తర్వాతే అమ్మకానికి పెడతారు.
ఎందుకంటే..? వరల్డ్ కప్ టికెట్లను విడతల వారీగా అమ్మాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అందులోనూ అత్యంత ఆదరణ ఉన్న టీమిండియా మ్యాచ్ టికెట్లను ఆఖర్లో అమ్ముతున్నారు. ఆగస్టు 25 నుంచి టికెట్లు అందుబాటులో ఉంటాయి.
🎟️ #CWC23 Ticket sales
🔹 25 August: Non-India warm-up matches and all non-India event matches
🔹 30 August: India matches at Guwahati and Trivandrum
🔹 31 August: India matches at Chennai, Delhi and Pune
🔹 1 September: India matches at Dharamsala, Lucknow and Mumbai
🔹 2… pic.twitter.com/GgrWMoIFfA— ICC (@ICC) August 15, 2023
ఆగస్టు 25 – టీమిండియా వామప్, ఇతర మ్యాచ్లు కాకుండా మిగతా జట్ల మ్యాచ్ టికెట్లు
ఆగస్టు 30 – భారత జట్టు గువాహటి, త్రివేండ్రంలో ఆడనున్న మ్యాచ్ టికెట్లు
ఆగస్టు 31 – టీమిండియా చెన్నై, ఢిల్లీ, పూణెలో తలపడనున్న మ్యాచ్ టికెట్లు
సెప్టెంబర్ 1 – ధర్మశాల, లక్నో, ముంబై వేదికలపై భారత మ్యాచ్లు
సెప్టెంబర్ 2 – బెంగళూరు, కోల్కతాలో టీమిండియా మ్యాచ్ టికెట్లు
సెప్టెంబర్ 3 – భారత్, పాకిస్థాన్ (అక్టోబర్ 14) మ్యాచ్ టికెట్లు
సెప్టెంబర్ 15 – సెమీఫైనల్స్, ఫైనల్ పోరు టికెట్లు
ఆగస్టు 15 నుంచి www.cricketworldcup.com వెబ్సైట్లో ఫ్యాన్స్ వరల్డ్ కప్ అప్డేట్స్ తెలుసుకోవచ్చని ఐసీసీ చెప్పింది. దాంతో, టికెట్ బుక్ అయిందా? లేదా? అనే సమాచారం ముందుగానే తెలుస్తుంది. అక్టోబర్ 5న ఇంగ్లండ్, న్యూజిలాండో మ్యాచ్తో ప్రపంచ కప్ మొదలవ్వనుంది. భారత జట్టు తొలి మ్యాచ్(అక్టోబర్ 8న) ఆస్ట్రేలియాను ఢీకొననుంది. చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్థాన్ అహ్మదాబాద్ వేదికగా అక్టోబర్ 14న తలపడనున్నాయి.