IND vs SA | టీమిండియా, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్లో భారత్ 4 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్తో పాటు పుజారా, రహనే.. నలుగురు బ్యాట్స్మెన్ క్యాచ్ అవుట్ అయ్యారు. 50 ఓవర్లకు నాలుగు వికెట్ల నష్టంతో భారత్ 135 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ ఉన్నారు.
కేఎల్ రాహుల్ 35 బంతుల్లో 12 పరుగులు, అగర్వాల్ 35 బంతుల్లో 15, పుజారా 77 బంతుల్లో 43, రహనే 12 బంతుల్లో 9 పరుగులు చేసి అవుట్ కాగా.. ప్రస్తుతం క్రీజులో ఉన్న విరాట్ కోహ్లీ 123 బంతుల్లో 38 పరుగులు చేశాడు. పంత్ 21 బంతుల్లో 9 పరుగులు చేశాడు. ప్రస్తుతం రన్ రేట్ 2.70గా ఉంది. సౌత్ ఆఫ్రికా బౌలర్లలో రబడా రెండు వికెట్ తీయగా ఒలివియర్, జాన్సెన్ చెరో వికెట్ తీశారు.