IND vs WI | భారత్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్లో ఇప్పటి వరకు భారత్ 4 వికెట్లను కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ.. 15 బంతుల్లో 7 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 15 ఓవర్లకు టీమిండియా 4 వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో సూర్యకుమార్ యాదవ్, వెంకటేశ్ అయ్యర్ ఉన్నారు. ఓపెనర్లలో ఇషాన్ రెచ్చిపోయాడు. 31 బంతుల్లో 34 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. శ్రెయాస్ అయ్యర్ 16 బంతుల్లో 25 పరుగులు చేశాడు. సూర్యకుమార్ యాదవ్ 18 బంతుల్లో 30 పరుగులు చేశాడు.