IND vs WI | టీమిండియా, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్లో తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్ ఇప్పటికే మూడు వికెట్లను కోల్పోయింది. 12 ఓవర్లకు మూడు వికెట్ల నష్టానికి భారత్.. 81 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ ఉన్నారు. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ 8 బంతుల్లో 4 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇషాన్ కిషన్ 31 బంతుల్లో 34 పరుగులు చేశాడు. శ్రెయాస్ అయ్యర్ 16 బంతుల్లో 25 పరుగులు చేశాడు. వెస్టిండీస్ బౌలర్లలో జాసన్ హోల్డర్, రోస్టన్ చేస్, హైడెన్ తలో వికెట్ తీశారు.