శాంటియాగొ(చిలీ) : ప్రపంచకప్ జూనియర్ హాకీ మహిళల టోర్నీలో భారత్ వరుసగా రెండో ఓటమి ఎదుర్కొన్నది. శనివారం ఉత్కంఠగా సాగిన పోరులో భారత జట్టు 2-3 స్కోరుతో బెల్జియం చేతిలో ఓడిపోయింది. ఆరంభంలో నోవా షెర్స్(5ని.), డి మాట్(42ని.) గోల్స్తో బెల్జియం ఆధిక్యంలో నిలిచింది.
అన్ను 47ని, 51ని.లలో పెనాల్టీ కార్నర్, పెనాల్టీ స్ట్రోక్స్ ద్వారా గోల్స్ సాధించి జట్టును పోటీలో నిలిపింది. అయితే చివరి క్షణాల్లో బొనామీ(52ని.) పెనాల్టీ స్ట్రోక్తో బెల్జియంకు విజయం అందించింది. భారత జట్టుకు ఇది వరుసగా రెండో పరాజయం. మూడు పాయింట్లతో భారత జట్టు ప్రస్తుతం రెండో స్థానంలో కొనసాగుతోంది.