దుబాయ్ : (T20 World Cup) టీ 20 ప్రపంచ కప్ మొదటి మ్యాచ్లో పాకిస్తాన్ చేతిలో ఓటమిని ఎదుర్కొన్నప్పటికీ, విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా టైటిల్ గెలువడం ఖాయమని ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ చెప్పారు. అలాగే, నవంబర్ 14న జరగనున్న ఫైనల్ మ్యాచ్లో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతుందని జ్యోతిషం చెప్పారు. భారత ఆటగాళ్లు రిలాక్స్డ్గా మ్యాచులు ఆడితే వారికి ఎదురుండదని అభిప్రాయపడ్డారు.
భారత్పై పాకిస్తాన్ అద్భుతమైన ఆటను ప్రదర్శించిందని చెప్పిన బ్రెట్లీ.. ముగ్గురు స్పిన్నర్లతో భారత్ ఆడినా వారు తమ పని సరిగ్గా చేయలేకపోతే ఎవరైనా ఏం చేయగలరు? అని ప్రశ్నించారు. భారత జట్టు ప్లేయింగ్ ఎలెవన్లో ఎలాంటి తప్పు లేదు, కానీ పాకిస్తాన్ గొప్ప క్రికెట్ ఆడినందుకు క్రెడిట్ ఇవ్వాల్సిందేనన్నారు. ఈ మ్యాచ్లో కోహ్లీ మాత్రమే భారత్కు అండగా నిలిచాడని, కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడని చెప్పారు. షాహీన్ ఆఫ్రిది బంతిని కోహ్లీ సిక్సర్గా మలిచిన తీరు అద్భుతమన్నారు. పాకిస్తాన్తో ఓటమి తర్వాత టీమిండియాకు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. భారత ఆటగాళ్లు రిలాక్స్ అయి మ్యాచులను నార్మల్గా తీసుకుంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఇలాఉండగా, టీ 20 ఫైనల్స్లో భారత్తో ఆస్ట్రేలియా ఢీకొనడం ఖాయమని చెప్పారు.
టీ 20 ప్రపంచకప్ తొలి మ్యాచ్లో భారత్పై పాకిస్తాన్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత్ తదుపరి మ్యాచ్లో న్యూజిలాండ్ను ఎదుర్కోనున్నది. భారత్ సెమీఫైనల్కు చేరుకోవాలంటే ప్రతి మ్యాచ్లో విజయం సాధించడం తప్పనిసరి.
పాకిస్తాన్లో రెండు వర్గాల మధ్య ఘర్షణ : 11 మంది మృతి
ఇది లైవ్ బ్యాక్టీరియా క్లియర్ ఫొటో.. వెల్లడించిన యూకే శాస్త్రవేత్తలు
బందీపొరాలో భద్రతా బలగాలే లక్ష్యంగా ఉగ్రవాద దాడి
జియో-బీపీ మొబిలిటీ స్టేషన్లు ప్రారంభం
సూడాన్లో సైనిక తిరుగుబాటు, దేశవ్యాప్తంగా ఆందోళనలు, ఏడుగురు మృతి
మీ ఎజెండాతో పార్టీకి నష్టం కలిగించకండి: సోనియాగాంధీ
ఈ పండు రోజూ తింటే హార్ట్ అటాక్ రాదంట..! ఆక్స్ఫర్డ్ పరిశోధకుల వెల్లడి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..